NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆలూరు పట్టణంలో “సుపరిపాలనలో తొలిఆడుగు”కార్యక్రమం

1 min read

ఆలూరు న్యూస్ నేడు : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,మన రాష్ట్ర ముఖ్యమంత్రి  .నారా చంద్రబాబు నాయుడు  చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటి అండ్​ మానవ వనరుల,విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బాబు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు యాదవ్ మరియు ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి .బి.వీరభద్రగౌడ్  ఆదేశానుసారం.  ఆలూరు పట్టణంలో టిడిపి నాయకులు,కార్యకర్తలు అందరూ మండల కన్వీనర్ అశోక్ యాదవ్  ఆధ్వర్యంలో 126,128 132,133,134,135 బూతులలో “సుపరిపాలనలో తొలిఆడుగు”కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమానికి    ఆలూరు మండల ఆయా గ్రామాల టిడిపి నాయకులు, కార్యకర్తలు మండల టిడిపి క్లస్టర్,యూనిట్ ఇంచార్జి లు,బూత్ ఇంచార్జి లు మరియు వివిధ హోదాలలో ఉన్న కూటమి  ప్రజా ప్రతి నిధులు,తెలుగు యువత, ఐటిడిపి , టియన్​ఎస్​ఎఫ్​, టిడిపి  సోషల్ మీడియా ప్రతినిధులు మండల టిడిపి సీనియర్ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author