మెడికవర్ లో.. ఆరోగ్యం పై అవగాహన సదస్సు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ లో మంగళవారం ఆరోగ్యంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవన విధానం, వ్యాధుల నివారణ మరియు సమయానికి చికిత్స ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిద్ధార్థ , గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ అబ్దుల్ సమద్ , జనరల్ సర్జన్ డాక్టర్ భార్గవి , ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ సునీల్ యాదవ్ పాల్గొని ఆరోగ్య సంరక్షణపై వివరించారు.వైద్యులు మాట్లాడుతూ, సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, తగిన నిద్ర మరియు మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. అలాగే కిడ్నీ, జీర్ణవ్యవస్థ మరియు అత్యవసర వైద్య సేవల ప్రాముఖ్యతను వివరిస్తూ, సమయానికి వైద్యులను సంప్రదించడం ఎంతో అవసరమని సూచించారు.అనంతరం మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు హెడ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ “ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాటను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స కంటే ముందుగానే నివారణపై దృష్టి పెట్టడం ఎంతో ముఖ్య మన్నారు.

