విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలకు ఆహ్వాన పత్రిక అందజేత
1 min read

హోళగుంద న్యూస్ నేడు : టిడిపి యువనాయకుడు రాజేంద్ర గౌడ్ కి హెబ్బటం గ్రామ వాల్మీకి నాయకులు ఆహ్వాన పత్రికా ఇవడం జరిగింది. శ్రీశ్రీ సవారమ్మదేవి, లక్ష్మమ్మదేవి మహాద్వార శిఖర 11 కళశాల ప్రతిష్ఠ,శ్రీశ్రీ సుంకులమ్మదేవి పాదాల ప్రతిష్ఠ మరియు శ్రీ వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలుతేదీ: 19-02-2026 గురువారము నుండి 20-02-2026 శుక్రవారము వరకువేద మంత్రోచ్చారణల నడుమ భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడనున్నవి.ఈ సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఈబీజీ గోవింద్ గౌడ్ నివాసంలో,ఆయన తనయుడు, టిడిపి యువనాయకుడు రాజేంద్ర గౌడ్ కిహెబ్బటం గ్రామ వాల్మీకి పెద్దలు, నాయకులు మరియు గ్రామస్తులు కలిసి ఆహ్వానం పత్రిక ఇవడం జరిగింది .ఈ దైవ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ,ప్రాంతీయ భక్తులందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి దేవతల దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు, హెబ్బటం వాల్మీకి పెద్దలు, నాయకులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

