29 న కురువ వివాహ పరిచయ వేదిక
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో . కర్నూలు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఆవరణలోని మండల ప్రజాపరిషత్ సమావేశం భవనం లో ఈ నెల 29 న ఆదివారం ఉదయం 10 గంటలకు కురువ, వివాహ పరిచయ వేదిక కరపత్రాన్ని కర్నూలు ఎం. పి. బస్తిపాటి నాగరాజు,కురువ సంఘం జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కె. రంగస్వామి, అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, కులస్థులు ఎం. పి. నివాసం దగ్గర ఆవిష్కరించారు.ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని కులజులు తమ అవివాహిత పిల్లలకు పెళిళ్ళు చేసేందుకు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో జిల్లా సంఘం నాయకులు కె. సి. నాగన్న,బి. వెంకటేశ్వర్లు, కె.ధనుంజయ, పాల సుంకన్న, తదితరులు పాల్గొన్నారు.

