మెప్మా పీడీ గా ఎం.రాజబాబు
1 min read

జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ని మర్యాదపూర్వకంగా కలిసిన రాజబాబు
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు నగరపాలక సంస్థలో మెప్మా (పట్టణ పెదరిక నిర్మూలన సంస్థ) ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఎం. రాజబాబు గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ లో గురువారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ని పూల మొక్కను అందించి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పట్టణ పెదరిక నిర్మూలన సంస్థ ద్వారా నిర్దేశిత లక్ష్యాలను సాధించాలన్నారు. రాజాబాబు విజయవాడలోని రాష్ట్ర పౌర సరఫరాల శాఖలో ఆడిట్ మేనేజర్ గా పనిచేస్తూ ఏలూరు నగరపాలక సంస్థలో మెప్మా (పట్టణ పెదరిక నిర్మూలన సంస్థ) ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఎం. రాజబాబు నియమింపబడ్డారు.

