అనాధ వృద్ధ మహిళలకు, వికలాంగులకు నిత్యవసర సరుకులు పంపిణీ
1 min read

హోళగుందన్యూస్ నేడు : 49వ నెల అనాధ వృద్ధ మహిళలకు, వికలాంగులకు, స్వామి వివేకానంద ట్రస్ట్ ఆదోని, భారత్ యూత్ అసోసియేషన్ హోళగుంద వారి ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది. నిరుపేద కుటుంబమైన హోటల్ ఈరన్న, ఎర్రమ్మ దంపతులకు,మార్లమడికి గ్రామానికి చెందిన వృద్ధురాలు రాధమ్మ, అంద వికలాంగుడు అయినటువంటి మడ్డీ లక్ష్మన్న, గ్రామానికి సేవలందిస్తున్నటువంటి గుర్క నిరుపేద కుటుంబాలకు ప్రతి నెల నిత్యవసర సరుకులను ప్రతి ఒక్కరి సహకారంతో అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో శ్రీధర్, మల్లికార్జున, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.


