ఫిబ్రవరి 8 నుండి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
1 min read

శ్రీశైలం, న్యూస్ నేడు: శ్రీ భ్రమరాంబికా సేవా సమితి, చీరాల వారు అన్నప్రసాద వితరణ విభాగానికి లక్ష విస్తరాకులను విరాళంగా అందజేశారు.వీరు అన్నపూర్ణాభవనం నందు సహాయ కార్యనిర్వహణాధికారి, పర్యవేక్షకుల వీటిని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ విస్తరాకులను సమర్పించడం జరిగిందన్నారు. వీటి విలువ రూ. 3,00,000/-లకు పైగా ఉంటుందని దాతలు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో వీరు విస్తరాకులను అందజేయడం జరుగుతోంది.ఈ కార్యక్రమములో భ్రమరాంబికా సేవా సమితి అధ్యక్షురాలు శ్రీమతి యం.వి. మహాలక్ష్మీ, పలువురు సేవా సమితి ప్రతినిధులు శివ సేవకులు పాల్గొన్నారు.

