NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లాకు విచ్చేసిన ప్రధాని కి ఘ‌న‌ స్వాగ‌తం ప‌లికిన మంత్రి టి.జి భ‌ర‌త్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఉమ్మడి క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న‌కు విచ్చేసిన భార‌త‌దేశ ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి ఉద‌యం ఓర్వక‌ల్లు ఎయిర్‌పోర్టులో రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ‌ మంత్రి టిజి భ‌ర‌త్ ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ఆ త‌ర్వాత శ్రీశైలం ప‌ర్యట‌న ముగించుకొని సూప‌ర్ జీఎస్టీ.. సూప‌ర్ సేవింగ్స్ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొనేందుకు విచ్చేసిన సంద‌ర్భంగా న‌న్నూరు స‌మీపంలోని హెలిప్యాడ్ వ‌ద్ద మ‌రోసారి ప్ర‌ధానికి.. మంత్రి టిజి భ‌ర‌త్ స్వాగ‌తం ప‌లికారు.  ఈ స‌భ వేదిక‌గా రూ.13,429 కోట్ల విలువైన అభివృద్ధి ప‌నుల‌కు మోడీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాప‌న‌లు చేశార‌ని టిజి భ‌ర‌త్ తెలిపారు. జీఎస్టీ సంస్కర‌ణ‌ల వ‌ల్ల క‌లిగే ప్రయోజ‌నాలు ఆయ‌న‌ ప్రజ‌ల‌కు వివ‌రించిన‌ట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉప్పెన‌లా ప్ర‌జ‌లు త‌ర‌లివ‌చ్చి ఎంతో ఆస‌క్తిగా న‌రేంద్ర‌ మోడీ సందేశం విన్నార‌న్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్ కృషితో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతోంద‌ని తెలిపారు. ప్రధాని ప‌ర్యట‌న విజ‌య‌వంతం చేసిన ప్రజ‌లంద‌రికీ మంత్రి టిజి భ‌ర‌త్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. కార్పొరేట‌ర్లు, బూత్ ఇంచార్జీలు, వార్డు ఇంచార్జీలు, క్ల‌స్ట‌ర్ ఇంచార్జీలు, కో క్ల‌స్ట‌ర్ ఇంచార్జీలు, యూనిట్ ఇంచార్జీలు, సీనియ‌ర్ నాయ‌కులు, కార్యక‌ర్తలు, అబ్వర్వర్లు, టిజిబి యూత్, వివిధ కుల సంఘాలు, ప‌లు స్వచ్చంద సంస్థలు, టీజీవీ గ్రూప్ ఎంప్లాయిస్, అభిమానులు అంద‌రికీ ఆయన పేరుపేరునా ప్రత్యేక ధ‌న్యవాదాలు తెలిపారు. మోడీ స‌భ స‌క్సెస్ వెనుక వీరందరి స‌హ‌కారం ఎంతో ఉందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

About Author