రమణారెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే జయసూర్య
1 min read

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని 49బన్నూరు గ్రామ టిడిపి నాయకులు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.కర్నూలు ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకొని ఇంటికి వచ్చారు.విషయం తెలుసుకున్న నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య బుధవారం ఉదయం వారి ఇంటికి వెళ్లి రమణారెడ్డిని పరామర్శించి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.తర్వాతచౌట్కూరులో గూడెం దావీదుమరణించడంతో ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.ఎమ్మెల్యే వెంట మండలాల కన్వీనర్లు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,కాతా రమేష్ రెడ్డి నాయకులు సర్వోత్తమ రెడ్డి,గోకారి, నరసింహ గౌడ్,షబ్బు,మాజీ సర్పంచ్ నాగేంద్ర, సోఫిసాహెబ్,నబిరసూల్ పాల్గొన్నారు.

