పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్
1 min read

హొళగుంద న్యూస్ నేడు : ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వైకుంఠం శివప్రసాద్ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమాన్ని ఈరోజు హొళగుంద మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి నెల ఒకటో తారీకు 90% కు పైగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం కే చల్లుతుంది .ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ వీరన్ గౌడ్, జనసేన మండల కన్వీనర్ అశోక్, బిజెపి మాజీ మండల కన్వీనర్ ప్రసాద్, కూటమి నాయకులు పూజారి వెంకటగిరి , జంగల్ రామాంజిని,వలి భాష, యువ నాయకులు తిక్క స్వామి రారా సిద్ధ, ఐకల్ మల్లి, తరుణ్, పులిగన్న, తదితరులు పాల్గొన్నారు.

