ప్యాపిలి నూతన ఎస్సైగా పి. నాగార్జున
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి ఎస్సైగా పి .నాగార్జున నూతన బాధ్యతలు గురువారం చేపట్టారు. ఈయన ప్యాపిలి మండల పరిధిలోని జలదుర్గం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ఉన్నత అధికారుల మేరకు బదిలీపై ప్యాపిలికి ఎస్ ఐ గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ ను ఆర్లగడ్డ పోలీస్ స్టేషన్ కు బదిలేనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై పి నాగార్జున మాట్లాడుతూ ప్యాపిలి పట్టణంలో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టితో మటక ,నాటు సారా, పేకాట అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపుతానని అన్నారు. ప్రజాల సేవలకు ఎల్లప్పుడూ తోడ్పడతానని ప్రజలకు సమస్యలు వస్తే తమ స్టేషన్ కు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తానని ఆయన తెలిపారు.

