తలముడిపి కుందూనదిని పరిశీలించిన పాణ్యం ఎమ్మెల్యే..
1 min read

మిడుతూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని తలముడిపి గ్రామ సమీపంలో ఉన్న కుందూ వాగును పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి పరిశీలించారు.మొంథా తుఫాన్ వల్ల గత రెండు రోజులుగా వర్షం రావడంతో కుందూ నది బ్రిడ్జిపై నీళ్లు రావడంతో కుందూను బుధవారం ఉదయం ఎమ్మెల్యే పరిశీలించి ప్రయాణికులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో దశరథ రామయ్య,తహసిల్దార్ శ్రీనివాసులుకు ఎమ్మెల్యే తగు సూచనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

