వాయిస్ క్లోనింగ్ సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
1 min read

కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్.
కర్నూలు, న్యూస్ నేడు: వాయిస్ క్లోనింగ్ ద్వారా బంధువుల గొంతుతో ఫోన్ చేసి డబ్బులు అడిగే మోసాలు పెరుగుతున్నాయని ఇటువంటి సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ శనివారం తెలిపారు. AI వాయిస్ క్లోనింగ్ కు సంబంధించిన కొత్త స్కామ్లు జరుగుతున్నాయన్నారు. స్కామర్లు ఇప్పుడు గొంతులను క్లోన్ చేయడానికి AI ని ఉపయోగిస్తున్నారన్నారు. తెలిసిన బంధువులు / స్నేహితుల గొంతులాగా మాట్లాడుతూ అత్యవసర సహాయం చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బును త్వరగా బదిలీ చేయమని కోరతారన్నారు. డబ్బు బదిలీ పూర్తయిన తర్వాత, బాధితులు తమ కుటుంబ సభ్యుడిని లేదా స్నేహితుడిని స్వయంగా వచ్చి కలిసినప్పుడు లేదా సంప్రదించినప్పుడు తాము మోసపోయామని గ్రహిస్తారన్నారు. ముఖ్యంగా వారు అత్యవసర ఆర్థిక సహాయం కోరితే, ఏదైనా చర్య తీసుకునే ముందు వారి గుర్తింపును నిర్ధారించడానికి తెలిసిన, ధృవీకరించబడిన నంబర్ ద్వారా స్నేహితుడు/బంధువును సంప్రదించాలన్నారు. కర్నూలు ఎస్పీ ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పలు సూచనలు చేశారు. సోషల్ మీడియా , వాట్సాప్ , ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకూడదు.బ్యాంక్ ఖాతా వివరాలు, ఏటీఎం కార్డు నంబర్, ఓటీపీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని తెలియని వ్యక్తులతో పంచుకోకూడదు. అనధికారిక వెబ్సైట్లు, యాప్ల ద్వారా కొనుగోళ్లు చేయవద్ద అధికారిక షాపింగ్ యాప్లు/వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించండి. సోషల్ మీడియాలో కనిపించే అతిగా తక్కువ ధరల ఆఫర్లను నమ్మవద్దుఏదైనా సైబర్ మోసానికి గురైనట్లయితే వెంటనే 1930 సైబర్ హెల్ప్లైన్ నంబర్కు ఫోన్ చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు జిల్లా ప్రజలకు తెలియజేశారు.

