రహదారికి ఇరువైపులా ఉన్న ముళ్ళకంప చెట్లను తొలగింపు…
1 min read

ఆలూరు న్యూస్ నేడు : చిప్పగిరి గ్రామంలో రహదారి ఇరువైపులా ముళ్ళ చెట్లతో నిండి ఉండి పోవుటకు ఇబ్బందిగా ఉన్నందున ప్రజల విజ్ఞప్తి మేరకు కూటమి నాయకులు ప్రత్యేక చొరవతో ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి వర్యులు శ్రీమతి జ్యోతి దృష్టికి తీసుకొని పోవడంతో వెంటనే తక్షణ చర్యలు తీసుకొని రహదారికి ఇరువైపులా ఉన్న ముళ్ళకంప చెట్లను తొలగించి రోడ్డు చదును చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అల్లభకష్ డివైఎంపిడిఓ నాగరాజు . పంచాయతీ కార్యదర్శి ప్రమీల గారు.కూటమి నాయకులు వైకుంఠం వెంకటేశులు,వైకుంఠం లక్ష్మణ బాబు వి. లక్ష్మన్న వి. శ్రీనివాసులు, కొండ రామాంజనేయులు, వీరాంజనేయులు, నారాయణస్వామి మరియు ముఖ్య నాయకులు పాల్గొని ధన్యవాదాలు తెలియజేశారు.

