శ్రీ భక్త కనకదాసు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని వినతి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు : కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆలూరు మండలం, మనేకుర్తి గ్రామంలో కురువల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాసు విగ్రహమును తేదీ:10-09-25 న రాత్రి కొందరు దుండగులు ధ్వంసం చేసిన విషయం గురించి కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ ని కలిసి వినతి పత్రం అందజేయమైనది.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కర్నూలు జిల్లా కురువ సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.కె. రంగస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు పెద్దపాడు ధనుంజయ జిల్లా కోశాధికారి కే సి నాగన్న, అల్లూరు వెంకటేశ్వర్లు, రేమట సర్పంచ్ వెంకన్న, కె. మహేష్, కె. ప్రసాద్,కె. శివ, కె. సోమన్న తదితరులు పాల్గొన్నారు.

