NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భారతదేశంలో ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రవేశపెట్టిన శాంసంగ్

1 min read

గురుగ్రామ్, భారత్ న్యూస్​ నేడు:  మార్చి 2026 – భారతదేశ అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్‌ శాంసంగ్ నేడిక్కడ గెలాక్సీ A57 5G, గెలాక్సీ A37 5G మోడళ్లను ప్రవేశపెట్టింది. ఫోటోగ్రఫీ, పనితీరు, ఏఐ -ఆధారిత దైనందిన ఫీచర్లు మన్నికకు ప్రాధాన్యతనిచ్చే యువ వినియోగదారుల కోసం రూపొందించిన గెలాక్సీ A సిరీస్‌లో సరికొత్త చేర్పులు.మెరుగైన మన్నికతో కూడిన సరికొత్త డిజైన్ శైలిగెలాక్సీ A57 5G అల్యూమినియం ఫ్రేమ్‌తో వస్తుంది; కేవలం 6.9mm మందంతో, ఇప్పటివరకు వచ్చిన గెలాక్సీ A సిరీస్ పరికరాలలో ఇదే అత్యంత సన్ననిది. గెలాక్సీ A57 5Gలోని మరింత సన్నని బెజెల్స్ పరికరం దృశ్య సమ తుల్యతను మెరుగుపరుస్తాయి, తద్వారా మరింత లీనమయ్యే వీక్షణ అనుభవాన్ని అందిస్తాయి.గెలాక్సీ A57 5G 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. విజన్ బూస్టర్ టెక్నాలజీతో వస్తుంది. దీని 1900nits గరిష్ట ప్రకాశం, వినియోగదారులు బయటి వాతావరణంలో కంటెంట్‌ను స్పష్టంగా చూడటానికి, HDR కంటెంట్‌ను ఆస్వాదించ డానికి అనుమతిస్తుంది. గెలాక్సీ A57 5G, గెలాక్సీ A37 5G రెండూ ముందు, వెనుక భాగంలో గొరిల్లా గ్లాస్ విక్టస్+తో వస్తాయి. బెస్ట్ ఫేస్ ఫీచర్ గరిష్టంగా ఐదుగురికి మద్దతు ఇస్తుంది, దీని ద్వారా వినియోగదారులు ఒక గ్రూప్ షాట్‌లో ప్రతి వ్యక్తి నుండి ఉత్తమమైన ముఖ కవళికను ఎంచుకోవచ్చు. ఆబ్జెక్ట్ ఎరేజర్ టూల్ పరికరంలోనే పనిచేస్తుంది, 33 శాతం వేగంగా పనిచేస్తుంది, దీనివల్ల వినియోగదారులు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే చిత్రాల నుండి అనవసరమైన అంశాలను తొలగించవచ్చు.

About Author