ప్రముఖ నటుడు నిర్మాత బండ్ల గణేష్ శంషాబాద్ టు తిరుమల పాదయాత్ర
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ప్రముఖ నటుడు నిర్మాత బండ్ల గణేష్ ,చంద్రబాబు నాయుడు స్వచ్ఛందంగా కేసులు గెలిచినందుకు శంషాబాద్ టు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కోసం పాదయాత్ర చేస్తున్నందుకు ఆయనకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం కర్నూలు జిల్లా అధ్యక్షుడు పి హనుమంతరావు చౌదరి ఆర్గనైజర్ సెక్రెటరీ, లక్ష్మీ పద్మా చౌదరి, లక్ష్మీనారాయణ చౌదరి మద్దతుగా కొంత దూరం నడిచి సంఘీభావం తెలియజేసి మీ పాదయాత్ర విజయవంతం కావాలని బండ్ల గణేష్ మద్దతు తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పరిపాలన బాగా సాగాలని మన వంతు కర్తవ్యం గా పాదయాత్రలు గాని పూజలు గాని ప్రజలతో సన్నిహితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పథకాలను ప్రచారం చేద్దామని చంద్రబాబు నాయుడు కి నారా లోకేష్ బాబు కి కూటమి ప్రభుత్వానికి మద్దతు గా ప్రజలందరము మద్దతు కొనసాగిస్తామని చంద్రబాబు నాయుడు కోసం నిరంతరం శ్రమిద్దామని పి హనుమంతరావు చౌదరి అన్నారు.

