NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జూడో పోటీల్లో కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ

1 min read

పాఠశాల ఎస్ఓ విజయలక్ష్మి..

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్​ నేడు : రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో ముగ్గురు విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచినట్లు మిడుతూరు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఎస్ఓ విజయలక్ష్మి మంగళవారం తెలిపారు.ఈ సందర్భంగా ఎస్ఓ మాట్లాడుతూ గతంలో జిల్లా స్థాయిలో జరిగిన పోటీల్లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయి ఈనెల 19 నుండి 21 వరకు కర్నూలులో సుబ్బారెడ్డి కళాశాలలో జరిగిన రాష్ట్రస్థాయి జూడో పోటీలకు మా పాఠశాల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. పదవ తరగతి బి శృతి శ్రీకాకుళంతో పోటీ పడగా 3 వ స్థానంలో నిలిచారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న టీ నవీన విజయనగరంతో పోటీపడ్డారు. అదేవిధంగా బి విశ్వ భారతి కడపతో పోటీ పడగా 3వ స్థానంలో నిలిచినట్లు ఎస్ ఓ తెలిపారు.మంగళవారం మధ్యాహ్నం పాఠశాలలో ముగ్గురు విద్యార్థులను ఎస్ఓ మరియు పిఈటి సుమలత మరియు ఉపాధ్యాయులు అభినందించారు.

About Author