గురువులే సమాజానికి మార్గదర్శకులు ,స్ఫూర్తి ప్రదాతలు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్, నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అండ్ లీగల్ రైట్స్ ఫౌండేషన్ ,నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ ,మైక్స్ ఇంటర్నేషనల్, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, హెల్త్ కేర్ సెంటర్ మహారాష్ట్ర, వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ విశ్వమానవాదికార్ పరిషత్, ఇంటర్నేషనల్ హ్యూమన్ అకాడమీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్, బాసం ఫోరం ఫర్ కల్చర్ అండ్ ఆర్ట్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర గ్రంథాలయ సమావేశ భవనంలో లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అధ్యక్షతన అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించి రాష్ట్రస్థాయిలో ఉపాధ్యాయ వృత్తిలో మరియు, సామాజిక సేవా రంగంలో వృత్తిలో సేవలందిస్తున్న వారికి ఉత్తమ సేవా అవార్డులను 42 మందికి అందజేశారం. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరికిషన్, యుగంధర్ శెట్టి, లక్ష్మీనారాయణ, మురళి, డాక్టర్ రమేష్, తిరుపతి సాయి, రామకృష్ణ, దామోదర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డి, డిప్యూటీ లైబ్రేరియన్ పెద్దక్క, లయన్ పద్మశాలి వెంకటేశ్వర్లు,మురారి శంకరప్ప ,డాక్టర్ జయప్రకాష్, లయన్ డాక్టర్ ప్రభాకర్, ఎలమర్తి రమణయ్య, రాయపాటి నాగలక్ష్మి,,కే .డీ.జే బాబు తదితరులు పాల్గొన్నారు.

