సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు
1 min read

శ్రీశైలం, న్యూస్ నేడు: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈరోజు శ్రీ భ్రమరాంబామల్లికార్జునస్వామి భజనబృందం, యమ్మిగనూరు, కర్నూలు జిల్లా వారిచే భజన కార్యక్రమం నిర్వహించబడుతోంది.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ భజన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమములో శివ శివ శంకరా, ఈశ్వరా పరమేశ్వరా, శివ శివ అనవే, శ్రీశైలభ్రమరాంబికా, నమో పార్వతీ పరమేశ్వరా, నమశ్శివాయ, శ్రీశైలం శివమయం మొదలైన పలు భక్తిగీతాలను, అష్టకాలను మొదలైనవాటిని జమ్మన్నస్వామి, శీనప్ప, యల్లప్ప, శ్రీశైలంస్వామి, కృష్ణమూర్తి తదితరులు ఆలాపించనున్నారు. ఈ కార్యక్రమానికి తాళం సహకారాన్ని మహాలింగప్ప, రఘు, తబల సహకారాన్ని మద్దిలేటి, రిథమ్ ప్యాడ్ సహకారాన్ని తులసీ అందించనున్నారు. కాగా శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

