సుపరి పాలనలో తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించిన వీరభద్రగౌడ్
1 min read

న్యూస్ నేడు ఆలూరు : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ.శ్రీ.నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా…. ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి .బి.వీరభద్రగౌడ్ దేవనకొండ మండలం పి. కోటకొండ గ్రామంలో పర్యటించనున్నారు.ముఖ్యంగా ఇంచార్జి వర్యులు ప్రజల దగ్గరకు ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రజా శ్రేయస్సుకై చేపట్టిన పథకాల గురించి వారికి వివరించి,వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకొని బూత్ ఇంఛార్జీలతో ఎంవైటిడిపి యాప్ లో అప్లోడ్ చేయించడం జరిగింది.ఈకార్యక్రమంలో పి కోటకొండ గ్రామ మరియు దేవనకొండ మండల టిడిపి క్లస్టర్,యూనిట్ ఇంచార్జి లు,బూత్ ఇంచార్జి లు మరియు వివిధ హోదాలలో ఉన్న మండల మరియు తాలూకా ప్రజా ప్రతినిధులు ఐటిడిపి ,టిడిపి సోషల్ మీడియా ప్రతినిధులు మండల టిడిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు


