కృష్ణాజిల్లా దళిత సేన ఇన్చార్జిగా భూసే అనిల్ కుమార్ నియామకం
1 min read

బడుగు బలహీన వర్గాల హక్కుల సాధనకై శక్తివంచన లేకుండా పనిచేయాలి
వ్యవస్థాపక అధ్యక్షులు జుజ్జువరపు రవి ప్రకాష్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : కృష్ణాజిల్లా దళిత సేన ఇన్చార్జిగా భూసే అనిల్ కుమార్ ని నియమించినట్లు దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జువరపు రవి ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలో దళిత సేన కార్యాలయంలో జరిగిన దళిత సేన ముఖ్య నాయకుల సమావేశంలో దళిత సేన కృష్ణాజిల్లా ఇన్చార్జిగాఅధ్యక్షులుగా విద్యావంతుడు ఎస్సీ,ఎస్టీ, బీసీ,బడుగు బలహీన వర్గాల హక్కుల సాధనకు మరియు వారి యొక్క సంక్షేమంకై అభివృద్ధి మరియు అంబేద్కర్ జగజీవన్ రామ్ జ్యోతిరావు పూలే ఆశయ సాధన కై నిరంతరం శక్తి వంచన లేకుండా పనిచేసే విధంగా దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జువరపు రవి ప్రకాష్ విద్యావంతుడు భూసే అనిల్ కుమార్ ని నియమించి నియామక పత్రం అందజేశారు. పలువురు నాయకులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దళిత సేన నాయకులు పాల్గొన్నారు.

