ఘనంగా నిర్వహించిన పుట్టిన రోజు వేడుకలు
1 min read

విజయవాడ, న్యూస్ నేడు: రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పీతా గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పోరంకి పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ బీసీ నాయకులు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కేకును స్థానిక శాసనసభ్యులు బోడె ప్రసాద్ చే కట్ చేసి గోపిచంద్ కి శాలువా కప్పి, పుష్పం ఇచ్చి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారురాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పీతా గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా వారి స్వగృహం నందు రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ మరియు పెనమలూరు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు సoగేపు రంగారావు. మరియు బీసీ నాయకులు కేక్ కట్ చేసి, శాలువా కప్పి, పుష్ప గుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో తాడిగడప మున్సిపాలిటీ అధ్యక్షులు అనుమోలు ప్రభాకర్ రావు, రాష్ట్ర దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ బాలాజీ,రాష్ట్ర సగర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ తాడిశెట్టి వీరాస్వామి, రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచిత్ర, తుమ్మల రామ్ కుమార్, ఆకునూరు సుబ్బారావు, సిరిగిరి మధుసూదన్ రావు, బొర్రా వెంకట్, తాడిశెట్టి ప్రసాద్, ఆరేపల్లి దాసు, జన్ను నాగరాజు, అబ్రహం, అంగిరేకుల మురళి, కొనతం సుబ్రమణ్యం, మారుపూడి ధన కోటేశ్వరరావు, కోయా ఆనంద్, దోనేపూడి రమణ, వడ్డే జీవా ,కోసూరి రమేష్, వణుకూరి విక్రం తదితరులు పాల్గొన్నారు.

