NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థులకు నగదు బహుమతి

1 min read

హొళగుంద, న్యూస్​ నేడు: 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా హొళగుంద మండలం హెబ్బటం  గ్రామంలో 2024​– 25  విద్యా సంవత్సరంలో పది టాపర్​ గా నిలిచిన గ్రామానికి చెందిన విద్యార్థులకు జై జవాన్​ వెల్ఫేర్​ అసోసియేషన్​ కర్నూలు ఆధ్వర్యంలో నగదు బహుమతి అందజేశారు. అసోసియేషన్​ సభ్యుడు సిపాయి గంగాధర్​ చేతుల మీదుగా  మొదటి బహుమతిగా రూ. 10వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 5వేలను ప్రతిభ చూపిన విద్యార్థులకు అందజేశామని, విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు   అసోసియేషన్​ సభ్యులు శుక్రవారం విడుదల చేసిన  ఓ ప్రకటనలో తెలిపారు.

About Author