ఏపీ ఎన్జీవోస్ కర్నూలు నగర యూనిట్ కు అభినందనలు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డైనమిక్ లీడర్ కామ్రేడ్ విద్యాసాగర్ని మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వీ.రమణ ని కర్నూల్ జిల్లా సంఘ పక్షాన మర్యాదపూర్వకంగా విజయవాడ ఎన్జీవో హోం నందు కలవడం జరిగినది.ఈ సందర్భంగా ఇటీవల నూతనంగా ఎన్నికైన కర్నూల్ నగర యూనిట్ అధ్యక్షులు ఎం.రామకృష్ణ మరియు నగర కార్యదర్శి ఎస్.సాయిరాం వారి కార్యవర్గము రాష్ట్ర సంఘం నాయకత్వంను మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కర్నూల్ నగర యూనిట్ కార్యవర్గంనకు రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి.రమణ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు దస్తగిరి రెడ్డి , కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ , అన్నమయ్య జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి కర్నూలు జిల్లా కార్యదర్శి ఎం .సి .కాశన్న, నంద్యాల జిల్లా అధ్యక్షులు హుస్సేన్ రెడ్డి, కడప జిల్లా కార్యదర్శి నిత్య పూజయ,కోడుమూరు తాలూకా అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణమోహన్, జిల్లా సంయుక్త కార్యదర్శి నాగకిషోర్, కర్నూలు ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మద్దిలేటి, కర్నూల్ నగర కార్యవర్గం కోశాధికారి హరికృష్ణ గౌడ్ ఇంకా ఇతర కార్యవర్గ సభ్యులుమద్దయ్య ,శ్రీరాములు, పాల్గొన్నారు.

