ఉత్తమ అవార్డు అందుకున్న డిప్యూటీ తహసిల్దార్
1 min read

మిడుతూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తహసిల్దార్ షేక్ షాన్ వాజ్ ఉత్తమ అధికారిగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్ మరియు జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ అవార్డును షాన్వాజ్ కు అందజేశారు.ఈ సందర్భంగా తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది డిప్యూటీ తహసిల్దార్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

