మద్ది ఆంజనేయస్వామి వారిని పెద్ద ఎత్తున దర్శించుకున్న భక్తులు
1 min read

వివిధ సేవల రూపేణ రూ:1,68,700/- రూపాయలు ఆదాయం సమకూరినది
నిత్యాన్నదాన సత్రం నందు సుమారు 1995 మందికి అన్న ప్రసాద వితరణ
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: మంగళవారం సందర్భముగా ఏలూరుజిల్లా, జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్ధము చుట్టు ప్రక్కల గ్రామముల నుండియే గాక సుదూర ప్రాంతముల నుండి అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ స్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కుబడులు తీర్చుకుని, శ్రీ స్వామి వారికి అత్యంత ప్రీతీకరమైన తమలపాకులు (నాగవల్లీ దళములు)తో అష్టోత్తరం పూజలను, అన్నప్రాసనలు, వాహనం పూజలను ఆలయ అర్చకులచే నిర్వహించుకునినారు. ఈ రోజు శ్రీ స్వామి వారి దర్శనార్ధం ఈ రోజు మద్యాహ్నం/సాయంత్రం గం.3-00 వరకూ విచ్చేసిన సుమారు 1995 భక్తులకు శ్రీ స్వామి వారి నిత్యాన్నదాన సత్రము నందు అన్నప్రసాద వితరణ జరుపబడినది. ఈ రోజు మద్యాహ్నం/సాయంత్రం గం.3.30-00 వరకూ శ్రీ స్వామి వారి దేవస్థానమునకు వివిధ సేవల రూపేణా రూ.1,68,700/-లు ఆదాయము వచ్చినది. శ్రీ స్వామి వారి దర్శనార్ధమై విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యములూ కలుగకుండా తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి చందన తెల్పినారు. చంద్ర గ్రహణం సందర్భముగా ఆలయం మూసివేతమంగళవారం అనగా ది.03.03.2026 మంగళవారం సంపూర్ణ చంద్ర గ్రహణం కావున శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఉదయం గం.08.00ల నుండి ఆలయం మూసివేయబడును. తిరిగి మరలా ది.04.03.2026 బుధవారం ఉదయం నుండి శ్రీ స్వామి వారి దర్శన కైంకర్యములు ప్రారంభమవునని ఆలయ సహాయ కమీషనరు మరియు కార్య నిర్వహణాధికారిణి ఆర్.వి.చందన తెలియజేశారు.

