NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అర్జీ దారులను తిప్పించుకోవద్దు

1 min read

చేయగలిగిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ప్రజల నుండి పాజిటివ్  స్పందన వచ్చేలా ప్రభుత్వ సేవలు అందించాలి

హాస్టల్స్, స్కూల్స్, అంగన్వాడీ కేంద్రాల్లో మెనూ ప్రకారం ఆహారాన్ని అందించాలి

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

కర్నూలు, న్యూస్​ నేడు:  అర్జీ దారులను పది సార్లు  తిప్పించుకోవద్దని, చేయగలిగిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ – పిజిఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా జిల్లా  కలెక్టర్ ప్రజల నుండి వినతులను స్వీకరించారు.  ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా  కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థిక సంబంధం  కాని సమస్యలు, చేయగలిగిన సమస్యల పరిష్కారం లో ఏ మాత్రం జాప్యం చేయకూడదని అధికారులను ఆదేశించారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడి చిరంజీవి,  స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కొండయ్య,  జిల్లా  అధికారులు పాల్గొన్నారు.

About Author