లింగంపల్లిలో విద్యుత్ ప్రమాదం.. వ్యక్తి మృతి
1 min read

హొళగుంద న్యూస్ నేడు : హోళగుంద మండలంలోని లింగంపల్లిలో విద్యుత్ ప్రమాదంతో సోమవారం మారెన్న దుర్మరణం చెందారు. గ్రామానికి చెందిన ఈడిగా ఈరన్న ఇంటి ముందు ట్రాక్టర్లో పత్తి సంచులు దింపుతుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఘటనలో మారెన్న అక్కడిక్కడే మృతి చెందారు. ఆయనకు భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వం కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని ప్రజాసంఘాలు కోరారు.

