NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భారతదేశంలోనే తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం హైదరాబాద్‌లో

1 min read

10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో చిప్ టెక్నాలజీలను ప్రజలకు చేరవేసే ప్రత్యేక కేంద్రం

ప్రతి 30 రోజులకు కొత్త ఆవిష్కరణలతో కొత్త అనుభవం — ప్రపంచ స్థాయి ఇన్నోవేషన్లను దగ్గరగా చూడటానికి అరుదైన అవకాశం

విద్యార్థులు, స్టార్టప్స్, పరిశ్రమలు, పెట్టుబడిదారులు ఒకే వేదికపై కలుసుకునే చిప్ విప్లవం

హైదరాబాద్, న్యూస్​ నేడు : భారతదేశ సెమీకండక్టర్ రంగంలో చారిత్రాత్మక ఘట్టంగా, టీ-చిప్®️ (టెక్నాలజీ చిప్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్) దేశంలోనే మొట్టమొదటి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియంను హైదరాబాద్‌లో ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక అనుభవ కేంద్రం ద్వారా, చిప్ టెక్నాలజీల భవిష్యత్తు ఇప్పుడు ప్రజల ముందు ప్రత్యక్షంగా కనిపించనుంది.సాధారణ మ్యూజియంల మాదిరిగా పాత మోడళ్లను చూపించడమే కాదు, ఈ కేంద్రం జీవంతమైన ఇన్నోవేషన్ హబ్గా పనిచేస్తుంది. ఇక్కడ ప్రతి నెలా కొత్త ఆవిష్కరణలు ప్రజల ముందుకు వస్తాయి. టీ-చిప్ రూపొందించిన “30 డేస్ ఇన్నోవేషన్ మోడల్” ప్రకారం, స్టార్టప్స్‌, పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రపంచ టెక్ కంపెనీలు తమ చిప్ ఆవిష్కరణలను 30 రోజులపాటు ప్రదర్శించవచ్చు. ఈ గడువు ముగిసిన తరువాత కొత్త సంస్థలు కొత్త ఆవిష్కరణలతో ఈ స్థలాన్ని ఆక్రమిస్తాయి “విద్యార్థులు, పరిశ్రమలు, పెట్టుబడిదారులు, ప్రభుత్వాలు — అందరూ ఒకే వేదికపై కలుసుకునే అవకాశం ఇది. భారత్‌ను చిప్ వినియోగదారుడిగా కాకుండా, చిప్ సృష్టికర్తగా నిలబెట్టే దిశగా ఇది కీలకమైన అడుగు.”ఈ చారిత్రాత్మక మ్యూజియాన్ని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి  అక్టోబర్ 12న ప్రారంభించనున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు, పరిశ్రమ నాయకులు, అకడమిక్ ప్రముఖులు, అంతర్జాతీయ ప్రతినిధులు ఈ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు.బాలా  టి-చిప్‌ను తెలంగాణలోని మొట్టమొదటి  సెమీకండక్టర్ సెంటర్‌గా మరియు ప్రపంచంలోనే మొట్టమొదటి అనుభవ జోన్‌గా హైలైట్ చేస్తూ, 20+ ఇన్నోవేషన్స్ ప్రపంచ నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. అని తెలియచేస్తున్నారు .మరిన్ని వివరాలకు, రాబోయే ప్రదర్శనల కోసం www.tchip.co సందర్శించండి లేదా +91 81231 23434ను సంప్రదించండి.

About Author