బచ్చు జానకి రామ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం
1 min read

రాజ్య సభ మాజీ సభ్యులు టిజి వెంకటేష్
- 250 మంది మున్సిపల్ వర్కర్లకు ఉచిత వైద్య పరీక్షలు
కర్నూలు హాస్పిటల్ , న్యూస్ నేడు :కర్నూలు జిల్లా ప్రజలకు వివిధ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి… ఎందరో మనన్నలు పొందిన బచ్చు జానకి రామ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని రాజ్య సభ మాజీ సభ్యులు టిజి వెంకటేష్ అన్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా బుధవారం నగరంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో ప్రముఖ నెఫ్రాలజి వైద్యులు డా. సాయి వాణి, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డా. రవీంద్ర బాబు నేతృత్వంలో 250 మందికి ఉచిత మూత్ర పిండ వ్యాధులకు సంబందించి హెచ్బివి, ఆర్బీ ఎస్ మరియు బీపి, బరువు, ఎత్తు తదితర పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా బచ్చు జానకిరామ్ ఫౌండేషన్ మరియు కిడ్నీ కేర్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. సేవ చేయాలనే తలంపుతో ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డా. రవీంద్ర బాబు మున్సిపల్ వర్కర్లకు ఉచిత వైద్య శిబిరం, రెండు నెలల కిందట వర్కర్ల పిల్లలకు క్యాన్సర్ వ్యాక్సినేషన్ వేయడంతోపాటు వైద్య శిబిరం నిర్వహించారని పేర్కొన్నారు. అనంతరం నిర్వాహకులు డాక్టర్ సాయి వాణి మాట్లాడుతూ ముందు జాగ్రత్త చర్యలతో కిడ్నీ వ్యాధికి గురి కాకుండా ఉంటారని, కిడ్నీబాధితులు ఎవరైనా చివరి దశ వరకు తెచ్చుకోవద్దని సూచించారు. డయాలసిస్ బాధితులకు 250 లీటర్ల నీళ్లు అవసరమని, కొందరు ప్రతి వారం రక్తం ఎక్కించాల్సి ఉంటుందన్నారు. శరీరంలో మూత్ర పిండాలు దెబ్బతింటే ఆర్థికంగా, ఆరోగ్యంగా కూడా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తరువాత బచ్చు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డా. రవీంద్ర బాబు మాట్లాడుతూ మున్సిపల్ వర్కర్లు ఆరోగ్యం పై దృష్టి సారించాలని సూచించారు.



