జర్నలిస్ట్ రేవతి ప్రసాద్ కుమార్తె కి ఆర్థిక సాయం అందజేసిన జర్నలిస్ట్ నాయకులు
1 min read

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా జర్నలిస్ట్ మిత్రుడు రేవతి ప్రసాద్ అనారోగ్య కారణంతో ఇటీవల మృతి చెందారు. రేవతి ప్రసాద్ కుమార్తెకు ఆర్థిక సాయం అందించేందుకు అనేకమంది జర్నలిస్టులు ముందుకొచ్చి తోచిన విధంగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు.సహాయాన్ని అందజేసిన ప్రతి ఒక్కరికి సీనియర్ జర్నలిస్టులకు సంఘ నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం ఉదయం ప్రసాద్ ఇంటికి వెళ్లి పెద్దలు రాజు. రఘురామ్.కిశోర్. ఫోటోగ్రాఫర్ కృష్ణ , చేతులు మీదుగా రూ:53.600/- లు ప్రసాద్ కుమార్తె జాహ్నవి కి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిహెచ్. రామకృష్ణంరాజు.కృష్ణ. షుకూర్. క్రాంతి పాల్గొన్నారు.రియాజ్. విన్ రాజు. కెమెరామెన్ శ్రీధర్. ప్రసాద్ తదితరులు రేవతి ప్రసాద్ తండ్రి సమక్షంలో కుమార్తె జాహ్నవి కి అందజేశారు.

