20 న జరిగే సన్మాన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు నగర బ్రాహ్మణ కుటుంబ బంధువులకు మరియు గౌరవ వేదపండితుల, పురోహితులకు, అర్చకులకు మహిళామణులకు, విద్యార్థిని విద్యార్థులకు , నమస్కరిస్తూ కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం వారు చేయు విజ్ఞప్తి , 2025 సెప్టెంబర్ 20 తేదీన పవిత్ర తుంగభద్రా నది తీరంలో ఉండే సంకల్ బాగ్ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు మన బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన శ్రీ కలపటపు బుచ్చి రాంప్రసాద్ కి మరియు నూతనంగా మన కర్నూలు నుండి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కు నియమితులైన డైరెక్టర్ల కు ఘనంగా సన్మానం ఉంటుంది. తదనంతరము మధ్యాహ్నం 1 30 గంటలకు విందు భోజనం ఏర్పాటు చేయడమైనది,అనంతరం సర్వసభ్య సమావేశం ఉంటుంది కావున అందరూ హాజరై జయప్రదం చేయవలసిందిగా ప్రార్థన,మీకు అందరికీ దినపత్రిక ద్వారా స్వాగతం పలకడం జరుగుతుంది కావున అందరూ హాజరై జయప్రదం చేయవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి ఇట్లు కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం కమిటీ సభ్యులు.

