NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మౌలానా అబుల్ కలాం ఆజాద్  137వ జయంతి

1 min read

కృత్రిమ మేధస్సు మరియు విద్య: ఆటోమేషన్ ప్రపంచంలో మానవ ప్రాతినిధ్యంను కాపాడటం.

కర్నూలు, న్యూస్​ నేడు: నగరంలోని ఉర్దూ విశ్వవిద్యాలయంలో జాతీయ విద్యా దినోత్సవం  మరియు మైనారిటీ సంక్షేమ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్  137వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటంనకు పూలమాల వేసి సత్కరించారు. ఈయొక్క కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్. ఏ. కోరి On-line లో “కృత్రిమ మేధస్సు మరియు విద్య: ఆటోమేషన్ ప్రపంచంలో మానవ ప్రాతినిధ్యంను కాపాడటం”. ఎలా అనే అంశంపై మాట్లాడారు. .ఈయొక్క కార్యక్రమంలో యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్. షావలి ఖాన్ , రిజిస్ట్రార్ ప్రొఫెసర్. వి. లోకానాథ , ఇంచార్జి ప్రిన్సిపల్ డా. మహబూబ్ భాష మరియు అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు.జారిచేయువారు రిజిస్ట్రార్, డా. అబ్దుల్ హాక్ ఉర్దూ యూనివర్సిటీ, కర్నూలు.

About Author