లబ్ధిదారులకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: డోన్ పట్టణంలోని కెవిఎస్ కాలనీ ప్రాంతంలో రేషన్ షాప్ ద్వారా లబ్ధిదారులకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజలకు నిత్యం అవసరమయ్యే రేషన్ సరుకులు అందుబాటులోకి రావడం పట్ల ఎమ్మెల్యే గ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.


