జాతీయ స్థాయి క్రికెట్ జట్టులోకి మాంటిస్సోరి విద్యార్థి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు పట్టణం ఏ క్యాంపులో ఉన్న మాంటిస్సోరి పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న పి. శ్రీవేంద్రనాథ్ గుంటూరులో జిల్లా స్థాయిలో జరిగిన క్రికెట్ పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, రాజస్థాన్ లో జనవరిలో జరగబోయే అండర్ 14 క్రికెట్ జాతీయ స్థాయి జట్టులో చోటు సంపాదించడం జరిగింది. ఈ సందర్భంగా మాంటిస్సోరి పాఠశాలల అధినేత కే.యన్.వీ .వీ. రాజశేఖర్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో కూడా శ్రీవేంద్రనాథ్ ఉత్తమ ప్రదర్శనతో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మరియు పాఠశాల విద్యార్థులకు చదువుతోపాటు వారి శారీరక దారుఢ్యం మరియు మానసికోల్లాసం కోసం ఆటలు తప్పనిసరిగా ఉండాలని తెలియజేశారు.

