రైతన్నా మీ కోసం మన మంచి ప్రభుత్వం
1 min read

హొళగుంద న్యూస్ నేడు : అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం రెండవ విడత నిధులను మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అన్నదాతల ఖాతాల్లో నేరుగా జమ చేసిన సందర్భంగా, ఆలూరు టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు “రైతన్నా మీ కోసం మన మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కుటామి ప్రభుత్వం రైతుల కోసం తీసుకువస్తున్న పలు సంక్షేమ పథకాలు, ఆర్థిక ప్రోత్సాహాలు, వ్యవసాయ రంగ అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు కలిగిన ‘రైతన్నా! మీ కోసం’ పుస్తికను రైతులకు అందజేశారు. కొత్త విధానాలు, పథకాల అమలు విధానం, భవిష్యత్ రోడ్మ్యాప్ గురించి వివరించారు.ఈ కార్యక్రమంలోతెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య మండల ప్రధాన కార్యదర్శి ఈబిజి గోవింద్ గౌడ్ . బిజెపి సీనియర్ నాయకులు చిదానంద ప్రసాద్ గసీనియర్ నాయకులు పంపాపతి, దుర్గయ్య ఎర్రి స్వామి ఆదాం టీడీపీ పట్టణం అధ్యక్షుడు అయ్యప్పజనసేన కో కన్వీనర్ వరల వీరేష్ సీబిఎన్ ఆర్మీ మోయిన్ రాము రామాంజనేయులు ఐ-టిడిపి హనుమంతుహుసేన్ పీరా, హుసేన్ మల్లికార్జున సాయిబేష్ వ్యవసాయ సహాయకులు శివ కృష్ణ నాయక్ మరియు ఉద్యానవన సహాయకులు S. రమేష్రైతు సోదరులుపాల్గొన్నారు.


