కరెంట్ లైన్ మరమ్మతులు.. విద్యుత్తుకు అంతరాయం
1 min read

ఉదయం 9:గంటల నుండి మధ్యాహ్నం 1:గంట వరకు విద్యుత్ నిలుపుదల
విద్యుత్ వినియోగదారులు సహకరించాలని మనవి
కె.ఎం. అంబేద్కర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,ఆపరేషన్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు జిల్లా,ఏలూరు మండలం , ఆర్.ఆర్.పేట – ఏలూరు సెక్షన్ పరిధి లో ఉన్న 33/11 కేవి సంతోష్ నగర్ సబ్ స్టేషన్ లో ఉన్న 11 కేవి గాంధీ నగర్ ఫీడర్ కు, చెట్లు నరుకుట మరియు లైన్ మరమ్మతు చేయుటకు గాను తేదీ. 29.08.2025(శుక్ర వారం) నాడు ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 01.00 గంటల వరకు అశోక్ నగర్ సబ్ స్టేషన్ పరిధిలో గల సుబ్బమ్మ దేవి పాటశాల ఏరియా, పాములదిబ్బ, చింతచెట్టు రోడ్, చాపతుము సెంటర్, గాంధీ నగర్, వాస వారి వీధి, శేఖర్ వీధి ఏరియాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును. కావున వినియోగదారులు గమనించి సహకరించవలసినదిగా కె.ఎం. అంబేద్కర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,ఆపరేషన్ ఒక ప్రకటనలో తెలిపారు.

