NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డబ్ల్యూటిఐటిసి మహిళా విభాగం ఎన్ఆర్ఐ జాయింట్ సెక్రటరీగా ప్రణీతా కొట్ల నియామకం

1 min read

హైదరాబాద్ / శార్లెట్, నార్త్ కరోలైనా : ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి‌ (డబ్ల్యూటిఐటిసి) మహిళల నాయకత్వాన్ని ప్రపంచ తెలుగు టెక్నాలజీ కమ్యూనిటీలో మరింత బలోపేతం చేస్తూ, మహిళా విభాగం ఎన్ఆర్ఐ జాయింట్ సెక్రటరీగా ప్రణీతా కొట్ల నియామకాన్ని ప్రకటించింది.ప్రణీతా కొట్ల ఇంటెలిజెంట్ ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో దాదాపు 12 ఏళ్ల అనుభవంతో డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌కి కొత్త దారులు చూపించిన ట్రయిల్‌బ్లేజర్‌. ప్రస్తుతం ఈఆర్పీ స్మార్ట్ ల్యాబ్స్లో లీడ్ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ డెవలపర్  గా పని చేస్తూ, కంపెనీలకు కోట్ల రూపాయలు ఆదా చేయడంతో పాటు వ్యాపార విధానాలను పూర్తిగా మారుస్తూ పలు విప్లవాత్మక కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. వృత్తి రంగానికి అతీతంగా, ఆమె ఐఈఈఈ నార్త్ కరోలైనా కౌన్సిల్ వైస్ చైర్ గా, అలాగే కరోలైనా ఉమెన్+ ఇన్ టెక్ లో టెక్ లీడ్‌గా పనిచేస్తూ మహిళా ప్రొఫెషనల్స్‌కు ప్రోత్సాహం అందించి, రాబోయే తరం నాయకత్వాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.మహిళా ప్రొఫెషనల్స్, ఆంత్రప్రెన్యూర్స్ టెక్ ఇండస్ట్రీ భవిష్యత్తు తీర్చిదిద్దడంలో చురుకుగా భాగస్వామ్యం అయ్యేలా సమతుల్య నాయకత్వ వ్యవస్థను నిర్మించడం. ప్రణీతా కొట్ల తన పదవీకాలంలో మహిళల పాల్గొనడం బలోపేతం చేయడం, మార్గదర్శక కార్యక్రమాలు చేపట్టడం, అలాగే గ్లోబల్ టెక్నాలజీ ఎకోసిస్టమ్‌ల మధ్య సహకారాన్ని పెంపొందించడం మీద దృష్టి పెట్టనున్నారు.

About Author