సొంత ఖర్చులతో పగిలిన పైప్ లైన్ సమస్యను పరిష్కరించిన ఎస్ డి పి ఐ
1 min read

హొళగుంద న్యూస్ నేడు : సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ప్రెసిడెంట్ కే జావిద్, కార్యదర్శి సైఫుల్ల హోలగుంద సినిమా రోడ్డు జమాపూర్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న బోర్ పైప్ లైన్ పగిలి నీళ్ళు వృథా అవుతుంటే సమస్యను గుర్తించిన ఎస్ డి పి ఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలు సొంత ఖర్చులతో ఆ పైపులైను మార్చి కొత్తగా పైపులైన్ చేసి అక్కడ ఒక కొత్త కోలాయినీ బిగించి సమస్యను పరిష్కరించారు. పైప్ లైన్ పగిలి నీటి వృధాగా వెళుతున్న సమస్యను వెంటనే స్పందించి పరిష్కరించిన ఎస్ డి పి ఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ కార్యకర్తలను కాలనీవాసులు అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎస్ డి పి ఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ కె. జావిద్,కార్యదర్శి , సైఫుల్ల ఫయాజ్ , కాలనీ వాసులు పాల్గొన్నారు.


