శారీరక, మానసిక దాడులపై అవగాహన కల్పించిన సిస్టర్ విద్యా
1 min read

తాడేపల్లి న్యూస్ నేడు: మంగళవారం గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ సిస్టర్స్ స్వచ్ఛంద సంస్థ వారి చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్టు లో భాగంగా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో ఉన్న మదర్ థెరిసా కిశోర బాలికల గ్రూప్ సభ్యులకు బాలికలపై జరుగుతున్న లైంగిక దాడుల నిరోధక చట్టం 2012 గురించి, బాల్య వివాహాలు వల్ల నష్టాల గురించి, కౌమార దశలో గర్భధారణ వల్ల కలిగే నష్టాల గురించి,ప్రభుత్వ ఉచిత హెల్ప్లైన్ నంబర్లపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సిస్టర్ విద్యా మాట్లాడుతూ, బాలికలపై జరిగే అఘాయిత్యాలు లైంగిక హింస, లైంగిక వేధింపులు, గృహ హింస, మానవ అక్రమ రవాణా, నిర్బంధ బాల్య వివాహాలు,డిజిటల్ వేధింపులు,ఆన్లైన్ వేధింపులు, సైబర్ బుల్లీయింగ్ వంటి అనేక రూపాల్లో దాడులు జరుగుతూనే ఉన్నాయని ఇవి బాలికల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపి, సామాజిక భద్రతకు ముప్పుగా మారుతున్నాయని ఈ సమస్యల నివారణకు కుటుంబం, సమాజం, ప్రభుత్వం సమిష్టిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లైంగిక వేధింపుల నుండి రక్షణ చట్టం 2012 అనేది వేధింపులకు గురైన బాధితులు తమ హక్కులను కాపాడుకోవడానికి ఒక మార్గాన్ని అందించే చట్టం . ఇది వేధింపులకు గురైన బాధితుల హక్కులను పరిరక్షించడంలో న్యాయస్థానాలకు మరియు పోలీసులకు సహాయపడే విధానాలను ప్రవేశపెడుతుంది అనివేధింపులు స్పష్టంగా కంటికి కనిపించే వాటికి మించి అనేక రూపాల్లో ఉంటాయని అవి కేవలం లైంగిక వేధింపులు మాత్రమే,కాకుండా,వివక్షాపూరిత, మానసిక,శారీరక, ఆన్లైన్/సైబర్ వేధింపులు, పని ప్రదేశంలో ప్రతికూల ప్రవర్తన వంటివి కూడా జరుగుతున్నాయని ఇటువంటి నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం, 2012 గురించి అందరూ తెలుసుకోవాలి అని అన్నారు.అలాగే పిల్లల అక్రమ రవాణా అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తీవ్రమైన నేరమని, ఇటువంటి ఘటనలు ఎక్కడైనా తెలిసిన వెంటనే 1098 ఉచిత హెల్ప్లైన్ నంబర్కు సమాచారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో చైతన్య బాలల పార్లమెంట్ అబ్దుల్ కలాం బాలల పార్లమెంట్కు చెందిన పిల్లలు, గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ సిస్టర్స్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది అత్తోట పోతురాజు, పి. అనిల్, బి.విజయ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.


