శ్రీమాళమల్లేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన బి.వీరభద్రగౌడ్
1 min read

హొళగుంద న్యూస్ నేడు: ఆలూరు తాలూకా ప్రజల అభిమాన నాయకులు తాలూకా తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, .బి. వీరభద్రగౌడ్ శ్రావణమాసం సందర్భంగా ప్రతిసంవత్సరం వారి ఇలదైవం అయిన శ్రీమాళా మల్లేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానకార్యక్రమం నిర్వహిస్తారు.ఇందులో భాగంగా వీరభద్రగౌడ్ ,యువ నాయకులు .గిరిమల్లేశ్ గౌడ్ సకుటుంబ సమేతంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.ఈకార్యక్రమానికి స్వామి వారి భక్తులు,చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అలాగే ఆలూరు తాలూకా ఆరు మండలాల ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నాయకులు,కార్యకర్తలు అలాగే రాష్ట్ర స్థాయి,జిల్లా స్థాయి,తాలూకా స్థాయి నాయకులు,డిసి చైర్మన్లు, నియోజకవర్గ ఆయా గ్రామాల టిడిపి నాయకులు,సర్పంచ్ లు ఎంపీటీసీ లు,తెలుగు యువత, ఐటిడిపి , టిఎన్ఎస్ఫ్, టియన్టియుసి, సిబిఎన్ ఆర్మీ, టిడిపి, సోషల్ మీడియా ప్రతినిధులు, బివిజి అభిమానులు అందరూ పెద్దఎత్తున హాజరు కావడం జరిగింది.


