టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం…
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ కేంద్ర కార్యాలయం లో టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశమునకు కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి,రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రివర్యులు శ్రీ టి. జి. భరత్, కర్నూలు పార్లమెంట్ సభ్యులు శ్రీ బస్తిపాటి నాగరాజు, శాసనసభ్యులు కే. ఇ. శ్యాం కుమార్ (పత్తికొండ), శ్రీ బొగ్గుల దస్తగిరి ( కొడుమూరు) శ్రీ బి. వి. జయ నాగేశ్వర రెడ్డి (ఎమ్మిగనూరు) నియోజకవర్గం ఇంచార్జీ కే. మీనాక్షి నాయుడు (ఆదోని) బి. వీరభద్ర గౌడ్ (ఆలూరు) శ్రీ రాఘవేంద్ర రెడ్డి (మంత్రాలయం) రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, కుడా చైర్మన్ శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కేడిసిసి బి చైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి, డి. సి. ఎం. ఎస్ చైర్మన్ వై. నాగేశ్వరరావు యాదవ్, రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నంద్యాల నాగేంద్ర, రాష్ట్ర కార్యనిర్వాహాక కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర లు మొదలగు వారితో పాటు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.సమావేశంలో ప్రధానంగా ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ఇంటింటికీ తీసుకెళ్లాలని వక్తలు వివరించారు.

