నైపుణ్యవంతమైన యువత వల్లే దేశాభివృద్ధి సాధ్యపడుతుంది…
1 min read

యువతలో నైపుణ్యాలను అభివృద్ధి చేయడం వల్ల ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి- లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్.
కర్నూలు, న్యూస్ నేడు: నైపుణ్యవంతమైన యువత వల్లే దేశ అభివృద్ధి సాధ్యపడుతుందని లయన్స్ మాజీ అడిషనల్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ, నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అన్నారు .ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ మరియు నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు డి.టి.పి.లో ఉచిత శిక్షణ తరగతులను నేడు నైస్ కంప్యూటర్ కార్యాలయంలో ప్రారంభించారు. అనంతరం కేఎన్ఆర్ స్కూల్ ప్రాంగణంలో జరిగిన యువత నైపుణ్య శిక్షణ ఉద్యోగ అవకాశాలు అనే అంశంపై అవగాహన కార్యక్రమంలో లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ నైపుణ్య శిక్షణ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని, యువత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణను కలిగి ఉండాలన్నారు.లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ మాజీ అధ్యక్షులు ఎల్ .సి .ఐ .ఎఫ్ కోఆర్డినేటర్ లయన్ పేరపోగు పవన్ కుమార్ మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకోవడమే కాకుండా స్వయం ఉపాధి అవకాశాలు కూడా పొందగలరన్నారు.వ్యక్తిత్వ వికాస నిపుణులు లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ గౌరవాధ్యక్షులు లయన్ కే .డి. జే బాబు మాట్లాడుతూ 9 ,10 వ తరగతుల నుండే కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, లీడర్షిప్ క్వాలిటీస్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం తెలుగు డిడిపి, కమ్యూనికేషన్స్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసం పై ఉచిత
శిక్షణ కొరకు ప్రచార కరపత్రాలను విడుదల చేశారు
.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అశ్వక్, టీచర్స్ జగదీష్, కృష్ణవేణి ,లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ కార్యవర్గ సభ్యులు , నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యవర్గ సభ్యులు ,యువతి యువకులు పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఇంతకు ముందు శిక్షణ పొందిన 25 మంది విద్యార్థులకు దృవీకరణ పత్రాలు అందజేశారు .ఆగస్టు 5వ తేదీన ప్రారంభమయ్యే తదుపరి శిక్షణా కార్యక్రమం కొరకు వెంకటరమణ కాలనీ మొదటి లైన్ లో ఉన్న నైస్ కంప్యూటర్ కార్యాలయంలో ఆసక్తి గల వారు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

