శిదలమైన నాగలకట్టకు పూర్వ వైభవం
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: శిదిలమైన నాగలకట్టకు పూర్వం వైభవం నెలకొన్నది. ప్యాపిలి పట్టణంలోని నాగుల కట్ట 70 సంవత్సరాల పైబడిన అతి పురాణమైన నాగుల కట్ట ఈ నాలుగుల కట్టను పోడమల సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి నాగలకట్టను అభివృద్ధి పరుచుకుంటూ ఇంతవరకు తీసుకొని వచ్చారు. ఆయన కానీ నాగల కట్టని పట్టించుకోకుంటే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి పూజలు అంతంత మాత్రమే జరిగేవి,ఇక్కడ రావిచెట్టు ,వేప చెట్టు, నాగ ప్రమిదలతో, తులసి చెట్టు, జమ్మి చెట్టు నెలకొన్నాయి. నాగుల కట్టకు వచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో నమ్మకంతో కొలిచిన వారికి కోరికలు నెరవేరుతాయని నమ్మకం, ఈ సందర్భంగా దాతలు నాగలకట్టకు పెయింటింగు , విగ్రహాల చుట్టూ గ్రిల్ ఏపిస్తూ ఏ జంతువులు గాని విగ్రహాలకు తాకకుండా పవిత్రంగా ఉండాలని కొంతమంది దాతలు ముందుకు వచ్చి అభివృద్ధి పరిచారు. శనివారం సుబ్రహ్మణ్యం స్వామి షష్టి సందర్భంగా నాగ హోమం నిర్వహించి, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. భక్తులు తరలివచ్చి సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకుని ముక్కులు తెచ్చుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇలాగే హిందువులలో ఐకమత్యం తో ఉండి పురాతమైన దేవాలయలు, దేవాలయలకు సంబంధించిన బావులను అభివృద్ధి పరచుకొని హిందుత్వానికి నాంది పలకాలని పలువురు కోరుకుంటూ ఈ అభివృద్ధి పనులు చేసినందుకు హిందువులు హర్షం వ్యక్తం చేశారు.

